భారత ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ వెస్టిండీస్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడేందుకు ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఈ జట్టు యాజమాన్యం పఠాన్ను తీసుకుంటే కరీబియన్ లీగ్లో ప్రాతినిధ్యం వహించిన తొలి భారత ఆటగాడుగా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి ఏ ఆటగాడు ఈ లీగ్లో ఆడలేదు. పఠాన్తో పాటు ఈ లీగ్లో పలు విదేశీ ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ లీగ్లో మొత్తం 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. కనిష్టంగా ముగ్గుర్ని, గరిష్టంగా నలుగురు స్వదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఒక విదేశీ ఆటగాడిని అట్టిపెట్టుకోవచ్చు. సెప్టెంబరు 4 నుంచి అక్టోబర్ 12 వరకు జరగనున్న ఈ లీగ్లో ఆడేందుకు ఇప్పటికే 536 మంది విదేశీ ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నారని సిపిఎల్ తన అధికారిక వెబ్సైట్లో తెలిపింది.