telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రియాంక రెడ్డి హత్యపై హీరోయిన్ల వ్యాఖ్యలు… ఏకిపారేస్తున్న నెటిజన్లు

Payal-and-Koina

శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్యపై బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా స్పందించారు. నిందితులను అక్కడికక్కడే ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటీమణులు అయిన కోయినా మిత్రా, పాయల్ రోహాత్గిలు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చపుట్టిస్తున్నాయి. నిందితులపై కామెంట్ చేస్తూ మతానికి ముడిపెట్టారు. దాంతో నెటిజన్లు వారిపై మండిపడుతున్నారు. ప్రియాంక రెడ్డిని హత్య చేసిన నిందితుల్లో ముగ్గురు నిందితులు హిందువులు, మరొకరు ముస్లిం. ఈ విషయాన్ని కోయినా మిత్రా గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. ‘హిందుస్థాన్ సిగ్గుతో తలదించుకుంది. నిందితుడైన మహ్మద్ పాషాను ఉరితీయండి’ అని పేర్కొన్నారు. దాంతో రాహుల్ ఈశ్వర్ అనే సామాజికవేత్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోయినా మిత్రా లాంటి ఓ నటి మిగతా ముగ్గురు నిందితులైన నవీన్, కేశవులు, శివలను వదిలేసి కేవలం మహ్మద్ పాషాకే ఉరిశిక్ష పడాలని చెప్పడం బాధాకరం. రేప్‌లకు, రేపిస్ట్‌లకు మతంతో పనిలేదు. ఈ విషయంలోనూ నిందితులను ఎంచుకోకండి’ అని పేర్కొన్నారు. పాయల్ రోహాత్గి అనే మరో నటి ప్రియాంక రెడ్డి హత్యపై ట్వీట్ చేస్తూ మతం గురించి ప్రస్తావించారు. ‘కనీసం ఇప్పుడైనా ప్రియాంక రెడ్డిని రేప్ చేసి చంపేసిన వాళ్లను ఉరితీయాలని నినాదాలు చేస్తారా లేకపోతే ఆమ్నెస్టీ ఈ బిల్లుని పాస్ చేస్తే మైనారిటీలను టార్గెట్ చేస్తారని అంటారా? మహ్మద్ పాషాను ఉరితీయండి’ అని పేర్కొన్నారు. దాంతో పలువురు నెటిజన్లు పాయల్ ఆలోచనా విధానంపై మండిపడ్డారు. ‘ఈ విషయంలో మతం గురించి ప్రస్తావించకండి. నిందితులు నలుగురూ నారాయణపేట జిల్లా వాసులుగా గుర్తించారు. మీరు మహ్మద్ పాషా గురించే ప్రస్తావిస్తున్నారు’ అని కామెంట్ చేశారు.

Related posts