telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రష్మిక మందన్న పారితోషికం… నిర్మాతలకు గుండెల్లో గుబులు

Rashmika

“ఛలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ సరసన “గీతగోవిందం” సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ.  వెండి తెరపై ఈ జంటకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. దీంతో మళ్ళీ ఈ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి “డియర్ కామ్రేడ్” చిత్రం చేశారు. ఈ సినిమా సంగతి ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీగా గడుపుతోంది. ఇటీవలే తెలుగులో మహేష్ తో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఈ బ్యూటీ… నితిన్ తో ‘భీష్మ’ సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ తమిళంలో కార్తీతో ఓ సినిమా చేస్తోంది. ఎంతో చలాకీగా ఉండే ర‌ష్మిక టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ సినిమాల‌లో ఆఫ‌ర్స్ కొట్టేసింది. తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా రష్మిక పేరే వినబడుతోంది. అయితే ఇప్పుడు ఆమె రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత రష్మిక తన రెమ్యునరేషన్‌ను అమాంతం ఇంత పెంచేసింది. ఈ సినిమాకన్నా ముందే రష్మిక చాలా ఎక్కువ వసూలు చేస్తోందని దర్శకనిర్మాతలు వాపోయేవారు. ఇప్పుడు ఈ మొత్తం వింటున్న వారు అంత మొత్తం ఇచ్చి ఆమెనే తీసుకోవాలా? లేక వేరే హీరోయిన్‌ని తీసుకోవాలా? అనే ఆలోచనలో పడ్డారట నిర్మాతలు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోలందరూ రష్మికనే కావాలని కోరడంతో నిర్మాతలు ఆమెకు 2 కోట్లు సమర్పించుకోక తప్పడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Related posts