telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆమెపై కోపం లేదు… కానీ అదే చిరాకేస్తుంది : విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన `అర్జున్‌రెడ్డి` సినిమా బాలీవుడ్‌లోకి `కబీర్ సింగ్` పేరుతో రీమేక్ అయ్యి అక్కడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు సినిమాలో నటించిన విజయ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్` సినిమాలపై విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ ఎదురుగానే మలయాళ నటి పార్వతీ మీనన్ `అర్జున్‌రెడ్డి`పై విమర్శలు చేసింది. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, పార్వతీ మీనన్, విజయ్ దేవరకొండ, ఆలియా భట్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్వతీ మీనన్ `అర్జున్ రెడ్డి`పై విమర్శలు చేసింది. “అర్జున్ రెడ్డి` సినిమాలో హీరో కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్‌ని కొడతాడు. సినిమాలో ఉన్న అలాంటి సన్నివేశాలు మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నట్టుగా ఉన్నాయి. ఒక నటిగా అలాంటి సన్నివేశాలు తెరకెక్కించొద్దని దర్శకుడికి చెప్పలేను. కానీ, అలాంటి సినిమాల్లో నటించడానికి నేను దూరంగా ఉంటాన`ని పార్వతి వ్యాఖ్యానించింది. విజయ్ ఎదురుగానే `అర్జున్‌రెడ్డి`ని విమర్శించిన పార్వతిపై కొందరు నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా గోవాలో జరిగిన ఇఫి స్వర్ణోత్సవ వేడుకలకు హాజరైన విజయ్.. పార్వతి వ్యాఖ్యలపై స్పందించాడు. “పార్వతి నటనను నేను చాలా ఇష్టపడతాను. ఆమె అలా మాట్లాడడాన్ని నేను పట్టించుకోవడం లేదు. ఎవరి అభిప్రాయం వారిది. ఆమెపై నాకు కోపం లేదు. నా సినిమాల గురించి ఎవరేం అనుకున్నా ఓకే. కాకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న హడావిడి నాకు చిరాకు తెప్పిస్తోంది” అని విజయ్ వ్యాఖ్యానించాడు.

Related posts