కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నేటి నుంచి (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో ప్రారంభమైంది.
న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్రధాన వేదికగా, సుష్మా స్వరాజ్ భవన్ మరియు అంబేద్కర్ భవన్లలో ఈ సదస్సు జరుగుతోంది.
2 లక్షల మందికిపైగా వస్తారనే అంచనాలతో పోలీసుల ఏర్పాట్లు చేసారు.
ప్రారంభోత్సవం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను అధికారికంగా ప్రారంభించనున్నారు.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్మాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు 20 దేశాల అధినేతలు, 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.
“పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్” (ప్రజలు, గ్రహం, ప్రగతి) అనే మూడు సూత్రాల ఆధారంగా ఏఐ (AI) ద్వారా సామాజిక మార్పును తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
ఫిబ్రవరి 16-20: ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో (ప్రదర్శన).
ఫిబ్రవరి 18: రీసెర్చ్ సింపోజియం (పరిశోధనా సదస్సు) – దీనికి IIIT హైదరాబాద్ నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది.
ఫిబ్రవరి 19-20: ప్రధాన ఏఐ సమ్మిట్ మరియు వివిధ దేశాల ప్రతినిధుల సమావేశాలు.
గ్లోబల్ సౌత్ దేశాల్లో జరుగుతున్న మొట్టమొదటి అతిపెద్ద ఏఐ సదస్సు ఇదే కావడం విశేషం.

