telugu navyamedia
National pm modi రాజకీయ వార్తలు సాంకేతిక

న్యూఢిల్లీలో నేటి నుంచి ఈనెల 20 వరకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నేటి నుంచి (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో ప్రారంభమైంది.

న్యూఢిల్లీలోని భారత్ మండపం ప్రధాన వేదికగా, సుష్మా స్వరాజ్ భవన్ మరియు అంబేద్కర్ భవన్‌లలో ఈ సదస్సు జరుగుతోంది.

2 లక్షల మందికిపైగా వస్తారనే అంచనాలతో పోలీసుల ఏర్పాట్లు చేసారు.

ప్రారంభోత్సవం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026ను అధికారికంగా ప్రారంభించనున్నారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సామ్ ఆల్ట్‌మాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు 20 దేశాల అధినేతలు, 40 మందికి పైగా సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది.

“పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్” (ప్రజలు, గ్రహం, ప్రగతి) అనే మూడు సూత్రాల ఆధారంగా ఏఐ (AI) ద్వారా సామాజిక మార్పును తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.

ఫిబ్రవరి 16-20: ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో (ప్రదర్శన).

ఫిబ్రవరి 18: రీసెర్చ్ సింపోజియం (పరిశోధనా సదస్సు) – దీనికి IIIT హైదరాబాద్ నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

ఫిబ్రవరి 19-20: ప్రధాన ఏఐ సమ్మిట్ మరియు వివిధ దేశాల ప్రతినిధుల సమావేశాలు.

గ్లోబల్ సౌత్ దేశాల్లో జరుగుతున్న మొట్టమొదటి అతిపెద్ద ఏఐ సదస్సు ఇదే కావడం విశేషం.

Related posts