telugu navyamedia
రాజకీయ వార్తలు

రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి: మోదీ పిలుపు

narendra-modi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. సాయంత్రం 6 గంట‌ల‌కు ముగియ‌నున్న‌ది.ఈ నేపథ్యంలో ఢిల్లీ ఓటర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ తొలి ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ ప్రజలు… ముఖ్యంగా నా యువ స్నేహితులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు కావాలి’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచారపర్వం యుద్ధాన్ని తలపించేలా సాగిన సంగతి తెలిసిందే. బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటులో సైతం ప్రకంపనలు పుట్టించాయి. 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి ఇప్పుడు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈసారి ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ పట్టుదలతో ఉంది.

Related posts