గుంటూరు జిల్లా తాడేపల్లిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. మున్సిపల్ ఆఫీస్లో ఇప్పటికే నలుగురికి సోకిన వైరస్ సోకగా… తాజాగా మరో ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ప్రైమరీ కాంటాక్ట్స్పై అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే మిగిలిన మున్సిపల్ సిబ్బందికి కరోనా టెస్టులు చేస్తున్నారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది భయంతో వణికిపోతున్నారు. ఆఫీసులకు రావాలంటే ముందు వెనుక ఆలోచిస్తున్నారు. కాగా… ఏపీలో కొత్తగా 174 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,91,178 కు చేరింది. ఇందులో 8,82,841 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1158 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,179 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 78 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
రామ్ చరణ్ తో పెళ్లి తరవాత ట్రోల్స్ ఎక్కువయ్యాయి : ఉపాసన