telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఢిల్లీ విమానాశ్రయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాను! ఆయనను కలవడం ఆనందంగా ఉంది: చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

కేంద్ర మంత్రులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీ విమానాశ్రయంలో వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది.

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేపట్టారు.

ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఎయిర్‌పోర్టులోని లాంజ్‌లో ఎంపీలతో కలిసి ఆయన కొద్దిసేపు సమావేశమయ్యారు.

అదే సమయంలో విమానాశ్రయంలో ఉన్న సచిన్ టెండూల్కర్.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అక్కడే ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే ఆయన వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా పలకరించారు. ఇద్దరు ప్రముఖులు కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.

Related posts