telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య : కెసిఆర్ పై నిప్పులు చెరిగిన షర్మిలా

తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చండూర్ మండలం పళ్ళెంలలో మరో నిరుద్యోగి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో.. మనస్తాపానికి గురైన పాక శ్రీకాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై షర్మిలా సపాదించారు. నిరుద్యోగులు అధైర్యపడద్దని షర్మిలా పేర్కొన్నారు. “నిరుద్యోగులు అధైర్యపడద్దు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎంతటి పోరాటానికైనా నేను సిద్ధం. నిరుద్యోగ యువతను .. మీ అక్కగా నేను కోరేది ఒక్కటే. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. రేపటి భవిష్యత్తు కోసం.. నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మనం కలిసి పోరాడుదాం. అయ్యా KCR సారు, “కనీసం మీ పార్టీ పుట్టిన రోజైనా చస్తే మా నిరుద్యోగులను గుర్తిస్తారేమో నని” నోటిఫికేషన్లు లేక మనస్థాపానికి గురై నల్గొండ నిరుద్యోగి శ్రీకాంత్ నిన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నడు. ఇకనైనా నిద్ర లేవండి. ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వండి. నిరుద్యోగ హత్యలు ఆపండి.”అంటూ షర్మిల పేర్కొన్నారు.

Related posts