మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని పాఠశాల వార్డెన్ దండించాడు. దీంతో అతనిపై ఏకంగా పదకొండు లక్షల జరిమానా విధించింది వినియోగదారుల ఫోరమ్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే..మహబూబాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న కృపాకర్ అనే విద్యార్థి చదువుతున్నారు. అయితే.. ఆ విద్యార్థి క్రమశిక్షణ రిత్యా పాఠశాల వార్డెన్ దారుణంగా కొట్టాడు. అయితే..ఈ ఘటనలో ఆ విద్యార్థి కనుచూపును కోల్పోయాడు. ఈ ఘటన పట్ల పాఠశాల యాజమాన్యానికి ఆ విద్యార్థి తండ్రి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ వినియోగదారుల సహాయ కేంద్రాన్ని ఆశ్రయించారు భాదితులు. ఆ ఫిర్యాదుతో కన్సుమర్ ఫోరం స్పందించి… ఇరువర్గాలను పిలిపించి కౌన్సలింగ్ జరిపింది. విద్యార్ధి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వార్డెన్కు 11,50,000 రూపాయలు చెల్లించాలని ఆదేశించింది కన్సుమర్ ఫోరం. వినియోగదారుల ఫోరమ్ ఆదేశాలతో భాదితులకు పదకొండు లక్షల యాబై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించింది ప్రైవేటు పాఠశాల యాజమాన్యం.
previous post
next post