telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో భారీగా గంజాయి పట్టివేత… ఏకంగా 390 కేజీలు

పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా డ్రగ్స్‌ ముఠాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. రోజు రోజులు డ్రగ్స్‌ ముఠాల ఆగడాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. ఏపీలోనూ గంజాయి కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు స్థానిక పోలీసులు. నగరంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లారీలో తరలిస్తున్న 390 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నర్సీపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి… దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ ముఠా వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా…నిన్న హైదరాబాద్ శివారు ప్రాంతంలో డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై డీఆర్‌ఐ ఇవాళ దాడి చేసింది. ఈ దాడిలో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో రా మెటిరీయల్స్‌ను తయారు చేస్తున్న ఈ ముఠా… హైదరాబాద్ నుంచి ముంబైకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నది.

Related posts