చైనాలో పుట్టిన కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఈ కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనాబారిన పడ్డారు. ఈ వైరస్తో చాలా మంది ప్రముఖులు కూడా మృతి చెందారు. తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా బారీన పడ్డారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికంగా వెల్లడించారు. కొవిడ్కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన పేర్కొన్నారు. తన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. వైద్యుల సలహా మేరకు కరోనా మార్గదర్శకాలను అనుసరించి హోం ఐసోలేషన్లోనే ఉంటున్నానని పేర్కొన్నారు.
previous post
రెడ్లలో జగన్ను గెలిపించుకోవాలన్న పట్టుదల: ఎంపీ జేసీ