telugu navyamedia
సినిమా వార్తలు

పారితోషికం గురించి హరీష్ శంకర్ వ్యాఖ్యలు

Harish-Shankar

అల్లు అర్జున్ తో “దువ్వాడ జగన్నాథమ్” తీసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే నెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా కోసం హరీష్ శంకర్ భారీ పారితోషికం తీసుకున్నారని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై హరీష్ శంకర్ స్పందించారు. “ఇప్పుడు గాసిప్‌లకు హద్దూ అదుపూ లేకుండా పోయాయి. ఇంటర్నెట్ విప్లవం వల్ల ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి చెప్పాలని ఉబలాటపడుతున్నారు. పారితోషికం అనేది నాకు, నా నిర్మాతకు సంబంధించిన విషయం. హరీష్ శంకర్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నాడు కాబట్టి ఈ సినిమా చూద్దాం అని ప్రేక్షకులెవరూ అనుకోరు. వాళ్లకి సినిమా ఎలా ఉందనేదే ముఖ్యం. పారితోషికం అనేది నావ్యక్తిగతమైన విషయం. ఏదేమైనా నా రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలన్నింటినీ ఖండిస్తున్నాను” అని హరీష్ శంకర్ చెప్పారు.

Related posts