telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జాతీయ కిసాన్ దివస్ సందర్భంగా రాష్ట్రంలో ని రైతన్నలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జాతీయ కిసాన్ దివస్ సందర్భంగా రాష్ట్రంలో ని రైతన్నలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

భారత మాజీ ప్రధాని శ్రీ చౌదరీ చరణ్ సింగ్ జయంతి సందర్భంగా కిసాన్ దివస్ నిర్వహించుకుంటున్న నేపధ్యంలో ముందుగా ఆ మహానుభావుడికి నివాళి అర్పిస్తున్నాను.

రైతు సాధికారత కోసం శ్రీ చౌదరీ చరణ్ సింగ్ ఎంతగానో పరితపించే వారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ రాష్ట్రం లో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

అన్నదాతా సుఖీభవ కార్యక్రమం తో రైతుకు ఏడాదికి రూ 20 వేల సాయం చేస్తున్నాం.

వాటర్ సెక్యూరిటీ, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్,ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే 5 కార్యక్రమాల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది అని చంద్రబాబు ట్వీట్ చేసారు .

Related posts