ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లోనూ బంగారం ధరలు పెరిగి పోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 పెరిగి రూ. 49,860 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 40 పెరిగి రూ. 45,700 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగి పోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 47,510 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 140 పెరిగి రూ. 43,550 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు అదే మార్గంలో భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 200 మేర పెరిగి రూ. 71,900 వద్ద కొనసాగుతోంది.
previous post


జగన్ ఢిల్లీ పర్యటన పై టీడీపీ నేతల విమర్శలు