టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. కలకత్తా 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన నాదెండ్ల మండలంలోని గణపవరం లో ఉన్న ఈ మిల్లు లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో గోడౌన్ లో ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న దూది బేళ్లు పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు ఎగసి పడుతుండడంతో పరిసర ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం అందవలసి ఉంది.