టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కబోతోంది. దీంతో కాజల్ పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ హంగామా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లి మండపానికి వెళ్తూ దిగిన కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. తన తల్లి సుమన్ అగర్వాల్తో కలిసి వివాహం జరగనున్న ‘తాజ్ ప్యాలెస్’ హోటల్కు పయనమైన కాజల్.. ముంబయిలోని తన నివాసం నుంచి బయటకొచ్చి అందరికీ అభివాదం తెలిపింది. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట షికారు చేస్తున్నాయి. ఇవి చూసి కాజల్కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. ఈ రోజే (అక్టోబర్ 30) వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడనుంది కాజల్. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచే కాజల్, గౌతమ్ ఇళ్లలో పెళ్లితంతు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. బుధవారం మెహందీ, గురువారం హల్దీ వేడుకలు కాజల్ నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కాజల్ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన చెల్లెలు నిషా కంటతడి పెడుతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసింది కాజల్. అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకున్న చెల్లెలు నిషా అగర్వాల్.. మెహందీ హల్ది వేడుకల్లో తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది. ఇకపోతే కరోనా కారణంగా కాజల్ వివాహ వేడుకకు కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించారు. టాలీవుడ్ నుంచి కాజల్ బెస్ట్ ఫ్రెండ్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ వేడుకకు హాజరు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘ఇండియన్-2’, ‘ఆచార్య’ సినిమాలకు కమిటైంది కాజల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెబుతోంది కాజల్ అగర్వాల్.
previous post