తన భద్రత కోసం ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించడం కంటే సాంకేతికతను ఉపయోగించుకుని, భద్రతా చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
ఆయన సూచనల మేరకు అధికారులు పలు చర్యలు చేపట్టారు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత, నిఘా కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్ ఏర్పాటు చేశారు.
ఈ డ్రోన్ ప్రతి రెండు గంటలకు ఒకసారి పైకి ఎగిరి పరిసరాలన్నింటినీ నిశితంగా గమనిస్తూ దృశ్యాలను చిత్రీకరిస్తుంది.
సాధారణంగా ఉండే పరిస్థితులకు భిన్నంగా ఎక్కడైనా కదలికలు ఉన్నా కొత్త వస్తువులు లేదా అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే మానిటరింగ్ బృందానికి సందేశం పంపుతుంది.
డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ముఖ్యమంత్రి నివాస పరిసర ప్రాంతాల్లో భద్రతను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
టెక్నాలజీని వాడుకోవడం ద్వారా తక్కువ భద్రతా సిబ్బందితో భద్రతను కల్పించే పని జరుగుతోంది.

