telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాజధాని అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల స్కాంలో ఐదుగురు అరెస్టు

అమ‌రావ‌తి అసైన్డ్‌ భూముల స్కాంలో ఐదుగురు అరెస్టు
1100 ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు
169.27 ఎకరాలకు సంబంధించి ఐదుగురు అరెస్టు
మాజీ మంత్రి నారాయ‌ణ బంధ‌వుల‌పై కూడా ఆరోప‌ణలు

ఏపీలో రాజధాని భూముల కేసు కొనసాగుతోంది. రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల కుంభకోణం కేసులో ఐదుగురు అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలో కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్‌, విజయసారధి, బడే అంజనేయులు, కొట్టి దొరబాబులను సీఐడీ అరెస్టు చేసింది.

1100 ఎకరాల అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 169.27 ఎకరాలకు సంబంధించి ఈ ఐదుగురిని సీఐడి అరెస్టు చేసింది.టీడీపీ నేత‌, మాజీ మంత్రి నారాయ‌ణ బంధ‌వుల‌పై కూడా ఆరోప‌ణలు ఉన్నాయి.

Related posts