సీఎం జగన్పై మరోసారి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏ1 క్రిమినల్ సీఎం..తన డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగరెడ్డితో దొంగ ఆరోపణలు చేయిస్తున్నాడు. నీ బతుకు ఫేక్. నీ పార్టీ ఫేక్. నీ హామీలు ఫేక్. నీ పాలన ఫేక్. చివరికి నాపై నీ దొంగల బ్యాచీతో చేయించే ఆరోపణలూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది. ఎన్నాళ్లీ దొంగలతో దొంగ ఆరోపణలు జగన్ రెడ్డీ! సింహాచలం అప్పన్న సన్నిధికి నువ్వే రా తేల్చుకుందాం.నువ్వు నా పై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం.నువ్వు సిద్ధమా? చేసిందే చట్టం, ఇచ్చేదే జీవోగా @ysjagan సర్కారు వ్యవహరిస్తోంది. జీఓ నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారు. జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ పీకేశారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి.. మిగిలిన జర్నలిస్టులందరి మొండిచేయి చూపడం చాలా దారుణం. అక్రిడిటేషన్ జర్నలిస్టుల హక్కు. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.” అంటూ తీవ్ర స్థాయిలో లోకేశ్ ఫైర్ అయ్యారు.
previous post