telugu navyamedia
CBN TDP Mahandu ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కడప వేదికగా నేడు రెండోరోజు తెలుగుదేశం మహానాడు

ఉదయం 10 గంటలకు మహానాడు రెండో రోజు వేడుక ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్న అశోక్ గజపతిరాజు .

తీర్మానాన్ని బలపరచనున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప. తెలుగుజాతీ-విశ్వఖ్యాతి, విధ్వంసం నుంచి పున్నర్మాణంవైపు అడుగులపై చర్చలు జరగనున్నాయి..

అభివృద్ధి వికేంద్రీకరణ-వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ అంశంపై చర్చలు జరగనున్నాయి.

యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయలతో మారునున్న రాష్ట్ర ముఖచిత్రంపై చర్చలు రాజకీయ తీర్మానంతో పాటు తదితర అంశాలపై మహానాడులో చర్చలు జరగనున్నాయి.

సాయంత్రం మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణస్వీకారం జరగను.

Related posts