ఏపీ సీఎం జగన్ సొంతిల్లు లేని వారి కల సాకారమయ్యేందుకు ప్రణాళిక సిద్దం చేయనున్నారు. సోమవారం ఉదయం ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సు వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటిస్థలం లేనివారు ఈ రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదన్నారు. ఈ ఉగాదికి 25లక్షల ఇంటి స్థలాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు.
నిజమైన లబ్దిదారులను అధికారులు గుర్తించాలని సూచించారు. పట్టాలు ఇచ్చేటప్పుడు ప్లాటు ఎక్కడుందో చూపించాలన్నారు. ఇందుకు గాను ఒక డిస్ట్రిక్ పోర్టల్ను ప్రారంభించాలని తెలిపారు. ప్రతి ఒక్క అంశాన్ని ఆ పోర్టల్లో పొందుపర్చాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా సూచించారు.
ఏపీకి కేంద్రం నుంచి సహకారం: కన్నా