telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంచెలంచెలుగా మద్యపాన నిషేధం: మంత్రి నారాయణ స్వామి

Narayana swamy Minister

అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఏపీ ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తొలివిడతగా బెల్టుషాపుల నిర్మూలనపై దృష్టి పెట్టామన్నారు. నాటుసారా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఒక్కో అధికారి ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని సారా తయారీని అరికట్టాలని ఇప్పటికే ఆదేశిలిచ్చామని చెప్పారు.

కల్తీమద్యం అమ్మకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించామన్నారు.గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది.. బడి, గుడికి దూరంగా మద్యం షాపులు ఉండేలా చేస్తామన్నారు. పేదలకు మద్యాన్ని దూరం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. మద్యరహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది అన్ని కుటుంబాల్లో ఆనందం నింపాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని చెప్పారు.

Related posts