యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది షూటింగ్ దశలో ఉండగానే తన తర్వాతి సినిమాను నితిన్ ప్రకటించాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు నితిన్ ట్విటర్ ద్వారా ప్రకటించాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయన్లుగా నటిస్తున్నారు. నిన్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. భవ్య ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సెట్స్పై ఉండగానే చంద్రశేఖర్ ఏలేటి సినిమాను నితిన్ ప్రారంభించాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు.
తాజాగా తన 29వ సినిమాను కూడా నితిన్ ప్రకటించాడు. “తొలిప్రేమ” దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాకు “రంగ్ దే” అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. “గివ్ మీ సమ్ లవ్” అనేది దీనికి ఉపశీర్షిక. ఈ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.