telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్, ఒంగోలులోని చదలవాడ ఇన్‌ఫ్రాటెక్‌ ఆవరణలో ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌, ఒంగోలులోని చదలవాడ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ (సీఐఎల్‌)పై డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

కంపెనీ మరియు ఇతరులపై బ్యాంకు మోసం కేసుకు సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం ఈ సోదాలు జరిగాయి.

హైదరాబాద్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ను చదలవాడ ఇన్‌ఫ్రాటెక్ రూ. 167 కోట్లు మోసం చేసిందని అధికారులు తెలిపారు.

చదలవాడ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌, డైరెక్టర్‌ చదలవాడ రవీంద్రబాబు తదితరులపై హైదరాబాద్‌లోని సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు.

బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్‌ నిధులతో డైరెక్టర్లు ఇతరులతో కలిసి కుట్ర చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు.

ఉద్యోగులు, డైరెక్టర్ల ఖాతాల్లోకి రుణ మొత్తాలను మళ్లించారని ఈడీ అధికారులు గుర్తించారు. ఆ నిధులను దుర్వినియోగం చేశారని వెల్లడించారు.

చదలవాడ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రికవరీ చేశారు. నేరారోపణకు సంబంధించి పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

నిధులు మళ్లింపునకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

Related posts