పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గంలో రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నియోజకవర్గంలోని 200వ పోలింగ్ కేంద్రంలో ఈనెల 19న జరిగిన పోలింగ్ను ఈసీ రద్దు చేసి, రీపోలింగ్కు ఆదేశించింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోల్కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని బెంగాల్ ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది.
ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించింది.ఆరు, ఏడో విడత ఎన్నికల సందర్భంగా బెంగాల్ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనివల్ల పోలింగ్కు అంతరాయం కలిగిందని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన ఈసీ వెంటనే అక్కడి అధికారుతో సంప్రదించి ఈమేరకు నిర్ణయం తీసుకుంది.