రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీనీ అడ్డుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. బెంగాల్లో కనీసం 22 లోక్సభ స్ధానాల్లో గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇక బుధవారం ఎన్నికల కమిషన్ను కలిసిన బీజేపీ నేతలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ బెంగాల్ను సమస్యాత్మక రాష్ట్రంగా ప్రకటించాలని కోరారు.
బెంగాల్లో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని తాము ఈసీ దృష్టికి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. స్ధానిక సంస్థలు, గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస, మృతుల వివరాలతో పాటు బీజేపీ నేతల హెలికాఫ్టర్ల ల్యాండింగ్కు అనుమతి నిరాకరణ వంటి అన్ని అంశాలను ఈసీకి కి వివరించామని తెలిపారు.
సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు ఎదురుదాడి: చంద్రబాబు