కేవలం రూ.100 కోసం గొడవపడి తాగిన మైకంలో వ్యక్తి పురుషాంగాన్ని కొరికేశాడు ఓ మందుబాబు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా కోవెలకుంటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జోళదరాశి గ్రామానికి చెందిన వడ్డే వెంకటేశ్వర్లు ఓ రోజు అదే గ్రామానికి చెందిన వడ్డే వెంకట సుబ్బయ్యకు రూ.100 అప్పు ఇచ్చాడు. కొద్ది రోజుల తర్వాత తన వద్ద తీసుకున్న వందరూపాయలను తిరిగి ఇవ్వాలని వెంకటేశ్వర్లు సుబ్బయ్యను అడిగాడు. దీంతో డబ్బులు అడిగిన వెంకటేశ్వర్లు సుబ్బయ్య పై కోపం పెంచుకున్నాడు.
బుధవారం సుబ్బయ్య తాగిన మైకంలో వంద రూపాయలు అడిగినందుకు వెంకటేశ్వరరావుపై తిరగపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పంచె ఊడిపోయింది. దీంతో సుబ్బయ్య అతడి మర్మాంగాన్ని కొరికేశాడు. బాధతో విలవిల్లాడుతున్న వెంకటేశ్వర్లును స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

