telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. విద్యుత్తుసౌధ ఉద్యోగుల దర్నా

Revanth-Reddy mp

విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ ట్రాన్స్ కో సీఎండీ అబద్ధాలు చెబుతున్నారని, ఆయన్ని గన్ పార్క్ ముందు నిలబెట్టి కాల్చి చంపినా తప్పులేదంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యల పై విద్యుత్తుసౌధ ఉద్యోగులు మండిపడుతున్నారు.

రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ విద్యుత్తుసౌధ ఉద్యోగులు ధర్నా చేశారు. రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఉద్యోగులుడిమాండ్ చేశారు. ఓటు కు నోటు దొంగ రేవంత్… ఖబడ్దార్ అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పనిపక్షంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తమ భవివష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని ఉద్యోగ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Related posts