telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహావ్యక్తి  బూర్గుల రామకృష్ణారావు: దత్తాత్రేయ

BANDARU DATTATREYA

దివంగత హైదరాబాద్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థ నాయకుడిగా, విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల అని కొనియాడారు.

బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారన్నారు. ఉత్తరప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ జయరాజ్‌ కెనడీ, సీసీఆర్‌ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు.

Related posts