telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు ఎందరో తెలుసా?

తెలంగాణలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ప్రాతినిథ్యం వెనుకబాటు కొనసాగుతుండగా, ప్రధాన పార్టీల నుంచి కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే సీట్ల కోసం పోటీ పడుతున్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తో సహా ప్రముఖ పార్టీల్లో ఎన్నికల పోరులో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది.

కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థులను ప్రతిపాదించగా, బీజేపీ ఇద్దరుని , బీఆర్‌ఎస్‌లు ఒకరిని నిలబెట్టాయి.

ప్రధాన రాజకీయ పార్టీల నుండి మొత్తం 51 మంది అభ్యర్థులలో, మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారు.

మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి పట్నం సునీతారెడ్డిని, వరంగల్‌కు కడియం కావ్య, ఆదిలాబాద్‌కు ఆత్రం సుగుణను కాంగ్రెస్‌ అభ్యర్థులుగా నిలిపారు.

హైదరాబాద్‌కు కొమెప్ల మాధవీలత, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి డీకే అరుణ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు.

మరోవైపు మహబూబాబాద్‌కు బీఆర్‌ఎస్‌ తన ఏకైక మహిళా అభ్యర్థిగా మాలోతు కవితను బరిలోకి దింపింది.

గత లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే, మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండే ధోరణి కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి కే కవిత పోటీ చేసి నిజామాబాద్ నుంచి విజయం సాధించారు.

2019లో, సంఖ్య కొద్దిగా పెరిగినప్పటికీ, అది సరిపోలేదు. మళ్లీ నిజామాబాద్ నుంచి కవిత, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, ఖమ్మంలో కాంగ్రెస్ నుంచి రేణుఖా చౌదరి, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేశారు. బీజేపీ నుంచి బంగారు శ్రుతి కూడా నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేశారు.

Related posts