వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” చిత్రం మే 1న ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ, చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మపై నూతన దర్శకుడు వాస్తవ్ మండిపడ్డారు. ద గ్రేట్ రామ్గోపాల్ వర్మ కెరీర్ మెదట్లో శివ, క్షణక్షణం లాంటి అద్బుతమైన చిత్రాలు తీసి చాలా మంది యూత్ ని దర్శత్వం వైపు రావటానికి మార్గం వేసిన గురువు, దర్శకుడు శంకర్ తన కెరీర్ లో”జెంటిల్మెన్” లాంటి చిత్రం తీసి శభాష్ అనిపించుకున్నాడని, రామ్గొపాల్వర్మ చేసిన చిత్రాలు చూసి ఇతను 20 సంవత్సరాల తరువాత టెర్మినేటర్ లాంటి గొప్ప చిత్రాలు చేస్తాడు అని అనుకునేవారు..శంకర్ ని మాత్రం మంచి చిత్రాలు తీస్తాడు అనుకున్నారు.. కానీ ఇప్పడు రామ్గోపాల్ వర్మ తీస్తున్నఆఫీసర్, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఐస్క్రీమ్ లాంటి నాసిరకం సినిమాలు చూస్తుంటే అభిమానులకి కోపం వస్తుందని అన్నారు.
అటు పక్క శంకర్ రోబో లాంటి అత్యాధునికమైన సాంకేతిక పరమైన చిత్రాలు తీస్తుంటే… రామ్ గోపాల్ వర్మ చెప్పేది అంతా సొల్లు మాత్రమేనని మండిపడ్డాడు. చాలా మంది అతనికి పిచ్చి పట్టిందేమో అనుకుంటున్నారని అన్నాడు. ఆయన అభిమానిగా తానొక ‘స్పెషల్’ చిత్రాన్ని తీసినట్లు చెప్పాడు. ఒక్కసారి నా చిత్రం చూసి అప్పుడు మాట్లాడు అంటూ రామ్ గోపాల్ వర్మకు సవాల్ విసిరాడు దర్శకుడు వాస్తవ్. అంతేకాదు ఇటీవల మందు తాగి ఎవడో రాసిచ్చిన పాటని పాడి సోషల్ మీడియాలో పెట్టాడని.. మినిమమ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్న నువ్వు శివ అనే చారిత్రాత్మక చిత్రాన్ని తీశావంటే నమ్మలేకున్నామని.. నీలాంటి వాడిని నమ్మి నిర్మాతలు, నటీనటులు మోసపోతున్నారని తన సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేశారు వాస్తవ్.
“డబ్బిస్తే బిగ్ బాస్ హీరో… లేదంటే వెధవ” నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు