ప్రస్తుతం కరోనా కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి దేశాలు. ఈ నేపథ్యంలో మిడతల దండు దాడి కూడా దానికి తోడైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను ఎడారి మిడతలు అతలాకుతలం చేస్తున్నాయి. నేల, చెట్టు, పుట్ట ఏదీ వదలకుండా సర్వనాశనం చేస్తున్నాయి. పంటలను పీల్చి పిప్పి చేస్తూ రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఈ మిడతల దండు గురించి బాలీవుడ్ సీనియర్ హీరో ధర్మేంద్ర ఓ ట్వీట్ చేశారు. చిన్నతనంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. “చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను పదో తరగతిలో ఉండగా ఇలాంటి ఘటనే ఎదురైంది. మిడతలను చంపడానికి విద్యార్థులందరినీ పిలిచారు. దయచేసి నివారణ చర్యలు తీసుకోండి” అని ధర్మేంద్ర ట్వీట్ చేశారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
Be careful 🙏 we have faced it , when I was the student of 10th class . All the students were called to kill them. Please be careful 🙏 pic.twitter.com/OvNn7NLRZb
— Dharmendra Deol (@aapkadharam) May 28, 2020
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా… కేసు నమోదు