దసరా పండుగ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం.. ఈ ఆదివారం జలవిహార్లో ప్రారంభమైంది. పార్టీలకు అతీతంగా నేతలంతా ఇకే వేదకిపై కలుసుకున్నారు. గిరిజన మహిళల నృత్యాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, పెద్దపులుల వేసాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.
అయితే ఈ కార్యక్రమంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు పాల్గొన్నారు. వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు కానీ ఎడమొహం..పెడమొహం. ఇబ్బందికరంగానే కూర్చుని బంగ్ కూడా తాగారు. పవన్తో మాట్లాడేందుకు మంచు విష్ణు యత్నించినా పవన్ అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయారు.
దీనిపై మంచు విష్ణు.. తన సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది.అలయ్ బలయ్ కార్యక్రమం వీడియో షేర్ చేయగా, ఇందులో చివర పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. అయితే మంచు విష్ణు వీడియో చివరలో ఉంది ఎవరో గెస్ చేయండని ట్వీట్ చేశాడు. అయితే ఇందులో ఉన్నది హీరో పవన్కల్యాణ్ అని చూసిన అందరికీ అర్థం అవుతోంది. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో మా ఎన్నికల హీట్ తగ్గలేదు అనేు అభిప్రాయం వ్యక్తం అయ్యింది.
Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T
— Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021
రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు