సినీ నిర్మాత, సినీనటుడు, కమెడియన్ బండ్ల గణేష్ ఇటీవల రాజకీయాల్లో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బండ్ల గణేష్ తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇచ్చాడు. మహేష్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు”లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్తో పాటు అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ‘టెంపర్’ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి.. మిగిలిన మొత్తానికి గణేష్ చెక్కులు ఇచ్చారు. మిగిలిన డబ్బును చెల్లించాలంటూ గణేష్ను పీవీపీ కోరారు. గణేష్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పీవీపీ ఇంటికి వెళ్లి ఆయనపై బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో శుక్రవారం రాత్రి పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయగా గణేష్తో పాటు అతని అనుచరులపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
previous post
next post