దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 60,975 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 848 మంది మృతి చెందారని వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,67,324 కు చేరింది.
దేశంలో మృతుల సంఖ్య 58,390కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 24,04,585 మంది కోలుకున్నారు. 7,04,348 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. నిన్నటి వరకు మొత్తం 3,68,27,520 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

