telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నీ మరణం ఇంకా నన్ను బాధిస్తుంది : సురేష్ రైనా

Suresh-Raina

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు సుప్రీం కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. కాగా సుశాంత్ కు న్యాయం జరగాలంటూ ఆయన అభిమానులు ట్విట్టర్ లో #JusticeforSushantSingRajput” అనే హాష్ ట్యాగ్ తో ప్రచారం చేస్తున్నారు. తాజాగా వారికి మాజీ భారత క్రికెటర్ సురేష్ రైనా మద్దతుగా నిలిచాడు. తన ట్విట్టర్ లో ”నీ మరణం ఇంకా నన్ను బాధిస్తుంది. కానీ నాకు తెలుసు నిజం అనేది తప్పకుండా బయటకు వస్తుంది” అంటూ సుశాంత్ అభిమానులు ట్వీట్ చేస్తున్న హాష్ ట్యాగ్ తో రైనా కూడా ట్విట్ చేసాడు. అలాగే సుశాంత్ తో దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ నెల 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా ఐపీఎల్ 2020 లో కనిపించనున్నాడు, ఇది సెప్టెంబర్ 19 నుండి యూఏఈ లో ప్రారంభమవుతుంది.

Related posts