telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో కరోనా మహోగ్రరూపం.. కొత్తగా 2,574 మందికి పాజిటివ్

Corona

తెలంగాణలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం… రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,574 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో మృతి చెందారు. ఈ క్రమంలోనే 2,927 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,40,969కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,07,530 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 886 కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 325 మంది కోవిడ్ బారినపడ్డారు.

Related posts