చీకటి తెరలు వెలుగును
కప్పేస్తున్న వేళ…
అతడు దూరంగా పచ్చిక తివాచీలపై
ఆమె ఒడిలో అలసిన మేనితో..
అటు వీచిన పిల్లగాలిని
వేడుకొంది గలగల చప్పుడుచేయొద్దని..
ఇంటిముఖం పట్టిన గొర్రెల మందను
ఇటు తేవద్దని వేలికొనలతో సైగ చేసింది..
సంతోషం తో గళమెత్తిన చకోరాన్ని
దూరపు సీమలో తన పాటను పాడమన్నది..
మెరుస్తున్న తారకలను ఆకుల
మాటున దాగమన్నది…
ఉరిమే మేఘ మాలికను కొంతతడువు
తన పరుగులు ఆపమన్నది…
వెదురు పాడే మురళీ గానంపై
పెదవుల తడి అద్ది మాయ చేసింది…
ఉదయపు తొలికిరణం
గడ్డిపై మెరిసేదాక చిత్తరువై కూచుంది…
తనమనసైన మనిషి కోసం……
శ్రీమతి అవధానం అమృత వల్లి.
ప్రొద్దుటూరు
ఫ్రీ భోజనం కోసమే ప్రెస్ మీట్లకు..జర్నలిస్టులపై కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు