telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 9,652 మందికి పాజిటివ్

Corona

ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 9,652 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 మందికి పాజిటివ్ అని తేలింది.రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది.

రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి చేరింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. గత 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు మీడియా బులిటెన్ లో వెల్లడించారు.

Related posts