telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సర్జికల్ స్ట్రైక్ చేసి.. పాకిస్తాన్ కొడుకులను తరిమి కొడతాం..

10 వేలు ఇస్తా అని ఇవ్వని టీఆర్‌ఎస్‌ కావాలా.. 25 వేలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని చెప్పిన బీజేపీ కావాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఆయన హబ్సిగూడా లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే మళ్ళీ కేసీఆర్ అవే హామీలు ఇచ్చారని.. ఆర్థిక సంఘం నిధులు 1287 కోట్లు కేంద్రం ఇస్తే.. 78 కోట్లు రాష్ట్రం ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రం రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసిందని… లక్షా 40 వేలు హైదరాబాద్ కి మంజూరు చేసిందని తెలిపారు. ఇళ్ల కోసం 2,280 కోట్లను కేంద్రం ఇచ్చిందని.. నేను మాట్లాడింది తప్పు అయితే తానను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే హబ్సిగూడా కి వచ్చి ముక్కు నేలకు రాయాలని సవాల్‌ విసిరారు. 2 లక్షల కోట్లు పన్నుల రూపంలో ఇక్కడ ప్రజలు కడితే.. 67 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 26 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన పైసలు గురించి చెప్పడం లేదని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థి గా గెలిచిన తర్వాత పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి.. రోహింగ్యాలను, పాకిస్తాన్ కొడుకులను తరిమి తరిమి కొడతామని.. బీజేపీ బరాబర్ హిందువుల కోసం పోరాడుతుందని పేర్కొన్నారు. హిందూస్తాన్ హైదరాబాద్ కావాలా.. భారత దేశ హైదరాబాద్ కావాలా భాగ్యనగర్ ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ధి భాగ్యనగరం కావాలా.. అరాచక భాగ్యనగర్ కావాలా ఆలోచించుకోవాలని బండి సంజయ్‌ కోరారు.

Related posts