*మహారాష్ర్ట ముఖ్యమంత్రి థాక్రేతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటి..
*జాతీయరాజకీయాలపై థాక్రేతో కేసీఆర్ చర్చలు..
ముంబైలో మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, కార్యాచరణపై చర్చ నడుస్తోంది.
మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన సతీమణి రష్మి, కొడుకు ఆదిత్య ఠాక్రేలు ఎదురొచ్చిమరీ సీఎం కేసీఆర్ ను రిసీవ్ చేసుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన కూతురు కవిత, టీఆర్ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కేసీఆర్ బృందానికి ఠాక్రే కుటుంబం సాదర స్వాగతం పలికింది. ఇంటి పెరట్లో చెట్ల కింద కాసేపు చర్చ తర్వాత అందరూ భోజనాలకు ఉపక్రమించారుఠాక్రే నివాసంలో ఇరువురు సీఎంలు లంచ్ చేస్తున్నారు.
అయితే, వారితో భేటీ అవుతున్న బృందంలో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారి భేటీకి మరింత ప్రాధాన్యత చేకూరింది.
ఠాక్రేతో భేటీ అనంతరం కేసీఆర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత శరద్ పవార్తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన నేపథ్యంలో… అక్కడ భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు కలిసి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.