ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు సంక్షేమ పథకాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే వైఎస్ఆర్ పోషణ పథకం అమలుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలిపింది. నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.
పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్ మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం, పాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, న్యాయపరమైన సమస్యలు, గోదావరి వరదలు, కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై కేబినెట్ చర్చించనుంది.
ఎన్నికల సంఘం ఏకపక్షం: యామిని