telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారుఖ్ ఖాన్ అవమానించడంతో సుశాంత్ బాధపడ్డాడు : సునీల్

Sushanth

జూన్ 14న ముంబైలో తన నివాసం ఉంటున్న ఇంట్లోనే సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో సుశాంత్ మృతిపై కుటుంబసభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యితే సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుశాంత్ మృతి కేసును సీబీఐకు అప్పిగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నెపోటిజంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు త‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితులను తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. తాజాగా సుశాంత్ స‌న్నిహితుడు, జిమ్ పార్ట్‌న‌ర్ సునీల్ శుక్లా షారూక్ ఖాన్ వ‌ల్ల సుశాంత్ బాధ‌ప‌డ్డ ఘ‌ట‌న‌ను వివ‌రించారు. 2013లో జ‌రిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో స్టేజీపై సుశాంత్‌ను షారూక్ అవ‌మానించార‌ని తెలిపారు. సునీల్ శుక్లా మాట్లాడుతూ “ఫిలింఫేర్ ఇన్విటేష‌న్ అందుకున్న సుశాంత్ చాలా సంతోషంగా ఫీల‌య్యారు. స్టేజీపై సుశాంత్ కెరీర్ ఎలా సాగుతుంది, ఈ క్ర‌మంలో త‌ను ఎదుర్కొన్న స‌వాళ్ల గురించి మాట్లాడుతాన‌ని చెప్పిన షారూక్ ఖాన్‌.. అందుకు భిన్నంగా షారూక్ స్టేజీపై సుశాంత్‌ను అవమానించారు. దీంతో సుశాంత్ చాలా గాయపడ్డాడు” అన్నారు.

Related posts