కరోనా ప్రభావంతో సినిమా ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కోరంగానికి సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్రం థియేటర్ల విషయంలో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తుందని భావించాయి. చలన చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర మంత్రి జవదేకర్ దృష్టికి తీసుకుని వెళ్లగా.. ఆయా రంగాలకు సంబంధించిన ప్రతినిధులతో చర్చలు జరిపిన ఆయన.. దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్ తరువాతే పరిశీలస్తామని తెలియజేశారు. సడలింపుల తరువాత కేసుల సంఖ్యని బట్టి థియేటర్లపై నిర్ణయం ఉంటుందని మంత్రి తెలిపారు. అయితే కోవిడ్ కేసులో ఒక్కసారిగా పెరిగిపోవడంతో మరో మూడు నెలలు పాటు.. అంటే జూన్, జూలై, ఆగష్టు వరకూ థియేటర్స్ బొమ్మ పడటం కష్టంగానే మారింది. మొత్తానికి అన్నింటితో పాటు థియేటర్స్ కూడా ఓపెన్ అవుతాయన భావించిన మూవీ లవర్స్ ఆశలు తీరాలంటే మరో మూడు నెలల వరకూ వేచిచూడాల్సిందే.
previous post