యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం “తెనాలి రామకృష్ణ బీఏబీఎల్”. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అనేది ట్యాగ్ లైన్. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన సాంగ్స్కి, టీజర్కి, రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. హీరో సందీప్ కిషన్ లాయర్గా నటిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ని జి.నాగేశ్వరరెడ్డి డైరెక్ట్ చేశారు. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించింది. ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో విడుదలవుతోన్న చిత్రమిది. సినిమా మీదున్న కాన్ఫిడెన్స్తో నిన్న రాత్రే హైదరాబాద్, కర్నూలు, తెనాలి, రాజమండ్రిలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ఈ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే పాజిటివ్ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. పర్ఫెక్ట్ కామెడీ పిక్చర్ అని, ఏపీలో పొలిటికల్గా బాగా పాపులర్ అయిన కోడికత్తి, గ్రామ వాలంటీర్లు, కేఏ పాల్ కామెడీ వంటి సంఘటనలను సినిమాలో బాగా వాడేశారట. ముఖ్యంగా కేఏ పాల్ పాడిన పాట స్టైల్లో నటి సత్య కృష్ణన్ చేసిన కామెడీ సినిమాకే హైలైట్ అని అంటున్నారు. కామెడీతో పాటు సెకండాఫ్లో మంచి ట్విస్ట్ కూడా ఉందట. అయితే సినిమాపై కొంత నెగెటివ్ టాక్ కూడా వస్తోంది. కామెడీ ఏమీ కొత్తగా లేదని, రొటీన్ ఊకదంపుడుతో విసిగించారని, నటీనటుల పర్ఫార్మెన్సులు బాగానే ఉన్నా.. దర్శకుడు సినిమాలో కొత్తగా ఏమీ చూపించలేదని అంటున్నారు. తమిళంలో నెగిటివ్ రోల్స్తో ఆకట్టుకుంటోన్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలోనూ అదరగొట్టారట. తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. ఆ డబ్బింగ్ కూడా చాలా బాగుందని అంటున్నారు. మరి చూడాలి ఈ సినిమా సందీప్ కిషన్ కు మంచి విజయాన్ని అందిస్తుందా ? లేదా ? అనేది.