వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (ఈ నెల 10న) పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 35,12,333 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు అవగాహన కల్పించి, 52,19,180 వ్యాక్సినేషన్ డోస్లు సిద్ధం చేసింది. మహిళా శిశు సంక్షేమశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐకేపీ, డిఫెన్స్, నేవీ, ఆర్టీసీ శాఖల సమన్వయంతో పోలియోచుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం చేపట్టనున్న కార్యక్రమంలో పల్స్పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు, ఆ తర్వాత రెండు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి వేసేందుకు వైద్యశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రయాణాల్లో ఉన్నవారికోసం 787 సంచార బృందాల ద్వారా అన్నిబస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో, ప్రధానకూడళ్లలో చుక్కలమందు వేస్తారు. పల్స్పోలియో కార్యక్రమంలో 95,513 మంది సిబ్బంది పాల్గొననున్నారు.