telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని చిరు పిలుపు…

Chiranjeevi

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టనున్నారు. అయితే ఈ ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. కోటి వృక్షార్చన లో పాల్గొని మొక్కలు నాటుదాం…. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం అని చిరంజీవి అన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనం తో కళ కళా అడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక గంటలో ఒక కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగస్వామ్యం అయి మొక్కలు నాటుదాం మన ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకుందాం అని చిరు పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Related posts