ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన ఘటనలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఘాటుగా స్పందించారు. మహిళలపై నేరాలు విపరీతంగా పెరిగిపోతుండటంపై ఆజాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. యూపీలో దారుణాలు జరుగడం కొత్తేమీ కాదని, అది సర్వసాధారణ విషయంగా మారిపోయిందని ఆజాద్ పేర్కొన్నారు. మహిళలపై వరుసగా లైంగిక దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు.
యూపీలో తరచూ చోటుచేసుకుంటున్నా దారుణాలను చూస్తుంటే అసలు అక్కడ ఒక వ్యవస్థ అనేది ఉందా? అనే అనుమానం కలుగుతున్నదని అన్నారు . యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అకృత్యాలు పెరిగాయన్నారు. గతంలో కూడా అక్కడ ప్రతిపక్ష నేతలపై దాడులు, హత్యలు జరిగాయాని ఆజాద్ గుర్తుచేశారు.