మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఒక మహిళా అభిమాని గుండె జబ్బుతో బాధపడుతున్నారని తెలుసుకుని ఆమెకు ఆపరేషన్ చేయించడానికి ముందుకొచ్చారు. ఈ లాక్డౌన్ సమయంలోనూ ఆమెను గుంటూరు నుంచి హైదరాబాద్కు రప్పించారు. బుధవారం ఆమెకు ఆపరేషన్ చేయిస్తున్నారు. ఈ మేరకు వివరాలను ‘అఖిల భారత చిరంజీవి యువత’ అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తెలియజేశారు. ఒక లేఖను విడుదల చేశారు. ‘‘దైవం మానుష రూపేణా అన్నారు పెద్దలు. అంటే.. మనుషుల్లోనే దేవుడున్నాడని అర్థం. ఆ విషయాన్ని పదేపదే తన పెద్ద మనస్సుతో నిరూపిస్తున్నారు మన మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు. గుంటూరు జిల్లా ‘చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ’ అధ్యక్షురాలు కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి గారు మెడికల్ రిపోర్ట్స్ తెప్పించుకుని హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ, ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ గోపీచంద్ గారి ద్వారా జబ్బు తీవ్రతను గమనించారు. వెంటనే హుటాహుటిగా ఆమెను హైదరాబాద్కి రప్పించే ఏర్పాట్లు చేసి, ఆపరేషన్కి సంబంధించి అన్ని సదుపాయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏప్రిల్ 8న ఆమెకి ఆపరేషన్ జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. తనను అమితంగా ప్రేమిస్తున్న అభిమానుల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్న శ్రీ చిరంజీవి గారి మంచి మనసుకి ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. నాగలక్ష్మి గారు తొందరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలవ్వాలని మనసారా ఆకాంక్షిస్తూ.. ఆ భగవంతుడుని ప్రార్థిస్తూ.. జై చిరంజీవ.. జై జై చిరంజీవ’’ అని స్వామినాయుడు తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ సమయం నడుస్తోంది. అన్ని రాష్ట్రాలు సరిహద్దులను మూసివేశాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వాహనాలు రావడం సాధ్యంకాని పని. కానీ, గుంటూరు నుంచి నాగలక్ష్మిని హైదరాబాద్కు తీసుకురావడానికి సత్తెనపల్లి జనసేన నాయకుడు భైరా దిలీప్ చక్రవర్తి సహాయం చేశారట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐజీలతో ఆయన మాట్లాడి ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ఈ విషయాన్ని కూడా ‘అఖిల భారత చిరంజీవి యువత’ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
డియర్ మెగా బ్రదర్స్ ! pic.twitter.com/78idtQg2WP
— Akhila Bharatha Chiranjeevi Yuvatha (@ABChiruYuvatha) April 7, 2020
కాస్త క్లోజ్గా ఉంటే లవ్ వచ్చేస్తుందా?… అమ్మ రాజశేఖర్ భార్య ఫైర్